టిటిడి వ్యవహారాలపై కోర్టుకెక్కనున్న స్వామి

న్యూఢిల్లీ,జూలై19(జ‌నం సాక్షి): బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ వివాదాస్పద నిర్ణయాలపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. టీటీడీపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను సుబ్రమణ్య స్వామి ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. టీటీడీపై కొంత కాలంగా వస్తున్న ఆరోపణలు, శ్రీవారి నగల వ్యవహారం గురించి సుబ్రమణ్య స్వామి ప్రధానంగా పిటిషన్‌లో పేర్కొననున్నట్టు సమాచారం. టీటీడీలో అర్చకుల తొలగింపు, పింక్‌ డైమండ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేస్తున్నట్టు ప్రకటించిన సుబ్రమణ్యస్వామి సంచలనానికి తెరలేపారు. రమణదీక్షితులు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సుబ్రమణ్య స్వామి నిర్ణయంతో టీటీడీ కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకునే పనిలో ఉంది. గతంలో సీబీఐ విచారణ డిమాండ్‌ను కేంద్ర న్యాయశాఖ తోసి పుచ్చింది.