టిడిపి ప్రభుత్వం అస్థిరతకు కుట్ర

జగన్‌,పవన్‌లపై మంత్రి జవహర్‌ మండిపాటు

ఏలూరు,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజలు తెదేపాకే మద్దతు ఇస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన

సోమవారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమావేశంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు వైకాపా అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు నిరింతరం ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వారిద్దరూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం డైరెక్షన్‌లో నడుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏర్పడిన తెదేపా, కాంగ్రెస్‌ మహాకూటమి

ప్రభావంతో కేసీఆర్‌ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. ఓటమి భయంతో చంద్రబాబుపై కేసీఆర్‌ లేని పోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, నర్సాపూర్‌ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.