*టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి పరామర్శించిన ఎమ్మెల్సీ*

జనంసాక్షి జూలై21 పెద్దేముల్
పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరేశం బుధవారం మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం  రుక్మాపూర్ గ్రామానికి చేరుకున్నారు.వీరేశం పార్థివ దేహానికి ఎమ్మెల్సీ నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కరణం పురుషోత్తమరావు,సిద్రాల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారేపల్లి బలవంత్ రెడ్డి, మంబాపూర్ ప్రకాష్,ఎంపిటిసి శీను, మల్లేశం,వెంకటప్ప, సత్యనారాయణ,శ్రీను,వడ్ల ప్రభు తదితరులు పాల్గొన్నారు.