టీఎన్జీవోల సమ్మె సైరన్
– సర్కారుకు నోటీస్
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు అందజేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. కొందరు సీమాంధ్ర మం త్రులు తెలంగాణ అంశంపై కేంద్రానికి తప్పుడు నివేది కలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ డ ిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం తెలం గాణలోని పది జిల్లాల ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. తెలంగా ణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మ్యాథ్యూకు సమ్మె నోటీసులు ఇచ్చారు. పదో పీఆ ర్సీ అమలు, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు తెలం గాణ నినాదాలు చేశా రు. ఈ నెల 20న ఛలో అసెంబ్లీ చూపడతామని ఉద్యో గులు సీఎస్కు చెప్పారు. తెలంగా ణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.