టీ మంత్రులు, ఎంపీలకు కాంగ్రెస్ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఎఫ్డీఐలపై పార్లమెంట్లో ఓటింగ్ జరుగనున్న దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగింపు చర్యలకు ప్రారంభించింది. తెలంగాణ ప్రాంత మంత్రులను, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను చర్చలకు రావాలని ఆహ్వానించింది. రేపు హైకంమాండ్తో మంత్రులు, ఎంపీలు భేటీ కానున్నారు. హైకమాండ్ తరపున కేంద్ర మంత్రులు సుశీల్కుమార్ షిండే, కమల్నాథ్లు చర్చల్లో పాల్గొననున్నారు.