టెన్త్ పాస్ చేయిస్తానంటూ దాష్టీకం
విద్యార్థిని ఫిర్యాదుతో కరెస్పాండెంట్ పరార్
ఒంగోలు,జనవరి22(జనంసాక్షి): ప్రకాశం జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని ఎంఆర్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ వీరయ్య నిర్వాకం మంగళవారం వెలుగు చూసింది. టెన్త్ పాస్ చేయిస్తానంటూ.. స్కూల్లోని ఓ మైనర్ విద్యార్థినిపై కరస్పాండెంట్ దాష్టీకానికి పాల్పడ్డాడు. కరస్పాండెంట్ వేధింపులను తట్టుకోలేకపోయిన బాలిక సంక్రాంతి సెలవులకు వెళ్లి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారని తెలిసిన వెంటనే కరస్పాండెంట్ స్కూల్కు తాళం వేసి పరారయ్యాడు. గతంలోనూ కొందరు విద్యార్థినులను వేధించినట్లు కరస్పాండెంట్పై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న కరస్పాండెంట్ వీరయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.