ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మకు కోర్టు అనుమతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి):

బతుకమ్మ పండుగ వేడుకలను ట్యాంకుబండుపై నిర్వహించు కునేందుకు హైకోర్టు శుక్రవారంనాడు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ జాతరను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు దరఖాస్తు చేసుకోగా పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదు. దీంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జాతరకు అనుమతినిస్తున్నట్టు హైకోర్టు శుక్రవారం జారీ చేసిన తన ఉత్తర్వులో పేర్కొంది. అయితే అక్టోబర్‌ 23వ తేదీన ఆ రోజు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని నిర్వాహకు లకు సూచించింది.