ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

ఖమ్మం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడే మరణించగా.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలాయపాలెం మండలం, పిండిప్రోలు వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సవిూక్షించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని, గాయపడిన మరో వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.