ట్రైమెక్స్‌ కార్మికుల ధర్నా

శ్రీకాకుళం,నవంబర్‌29(జ‌నంసాక్షి): పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాలని కోరుతూ.. ట్రైమెక్స్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ట్రైమెక్స్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఎంఎల్‌ఎ గుండా లక్ష్మి దేవి ఇంటిని గురువారం ముట్టడించింది. ట్రైమెక్స్‌ కార్మికులు మాట్లాడుతూ.. ట్రైమెక్స్‌ కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాలని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఇఎల్‌, సిఎల్‌, ఎస్‌ఎల్‌ లను వెంటనే అమలు చేయాలన్నారు. బోనస్‌లు, ఇంక్రిమెంట్‌లు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.