డబ్బుకోసం.. రేప్‌ కేస్‌ నాటకం కూపీలాగిన పోలీసులు

న్యూఢిల్లీ,జూన్‌15(జ‌నంసాక్షి):  డబ్బు విూద వ్యామోహంతో ఓ యువతి ప్రియుడితో కలిసి అత్యాచార నాటకమాడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు తీగ లాగడంతో గుట్టు రట్టయ్యింది. అత్యాచారం చేశారంటూ యువకులపై కేసులు పెట్టడం.. అనంతరం డబ్బిస్తే కేసు వెనక్కి తీసుకుంటానంటూ లక్షల రూపాయలు దోచుకోవడం… చేస్తోంది.దీనిపై ఆరా తీసిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. ఢిల్లీలోని జగత్‌పురిలో నివాసముంటున్న యువతి తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ గతవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే.. తనకు రూ. 10లక్షలు ఇస్తే కేసు వెనక్కి తీసుకుంటానని ఆ ముగ్గురు వ్యక్తులతో తర్వాత ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కేసుఉల, పరువు పోతుందన్న భయంతో ఆ యువకులు అడ్వాన్సుగా ఆమెకు రూ. 50వేలు  ఇచ్చారు. చేయని నేరానికి బాధితులవ్వడం ఇష్టంలేక విషయం పోలీసులకు చెప్పారు. పోలీసులు పథకం ప్రకారం వలపన్ని వారినుంచి మిగతా డబ్బు తీసుకునే సమయంలో యువతి, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఫిబ్రవరిలో కూడా వీరు ఇలాగే నాటకమాడి మరో ముగ్గురి దగ్గర రూ.5లక్షలు తీసుకొన్నారని పోలీసులు తెలిపారు. ఈ నాటకాలాడినందుకు, వారిపై మోసం కేసు నమోదు చేశారు.