డల్లాస్ రక్తసిక్తం.. ఐదుగురు పోలీసుల కాల్చివేత

dallas-policeఅమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డల్లాస్‌ లో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. మిన్నెసోటాలో నల్లజాతీయుల హత్యలను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసులపైనే దాడికి దిగారు. ఈ క్రమంలో కొంతమంది కాల్పులు జరిపారు. దీంతో నలుగురు పోలీసు అధికారులు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న ఒక వ్యక్తి ఫోటోను పోలీసులు విడుదల చేశారు.