డిఎస్సి అభ్యర్థు నిరసన
రాజమండ్రి, జనవరి18(జనంసాక్షి) : రాజమండ్రిలో డిఎస్సి అభ్యర్థులు శుక్రవారం నిరసన చేపట్టారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్పెషల్ స్కూల్ టీచర్లకు సంబంధించిన డీఎస్సీ-2018 పరీక్షలను ఈ రోజు ఆంధప్రదేశ్ వ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమయానికే వచ్చినా.. నిబంధనల పేరుతో పరీక్షా కేంద్రంలోకి తమను అనుమతించలేదని పలువురు అభ్యర్థులు రాజీవ్గాంధీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించడంతో కొంత సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.