డిపిఆర్వో తీరుపై జర్నలిస్టుల ఆందోళన
ఏలూరు,నవంబర్20(జనంసాక్షి): కొవ్వూరు పాత్రికేయుల పట్ల జిల్లా సమాచార అధికారి (డిపిఆర్ఒ) వైఖరిని నిరసిస్తూ.. మంగళవారం ఉదయం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జెమిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొవ్వూరు ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుద్దుపూడి రామచంద్రరావు ప్రారంభించారు. డిపిఆర్ఒ కె.సుభాషిణి నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై అనుచిత వైఖరిని ఖండించాలంటూ.. నినాదాలు చేశారు.