డిబిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ను పరామర్శించిన నాయకులు.

దౌల్తాబాద్ మే 10 (జనం సాక్షి )

దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ద లింగన్నగారి శంకర్ ను దౌల్తాబాద్ మండల నాయకులు శుక్రవారం పరామర్శించారు. శంకర్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని మిరుదొడ్డి మండలం లింగుపల్లి లోని ఆయన నివాసంలో పరామర్శించి సానుభూతి తెలియజేసారు.అదే విధంగా రాజయ్యకు జోహార్ అర్పిం చారు. ఉద్యమాలు దళిత బహుజన ఉద్యమాలు తన కుమారుడు శంకరన్నకుచేదోడు వాదోడుగా ఉండి ఉద్యమాలు నడిపించడంలో తండ్రిగా ప్రధాన పాత్ర వహించాడు. వారికి ఈ సందర్భంగా ఘనంగా జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో సూరంపల్లి మాజీ ఉపసర్పంచ్ బొల్లం స్వామి,కెంబసారి మల్లేష్, ముత్యాల శ్రీనువాస్ ,కముటం బాల్ నర్సు,,తదితరులు పాల్గొన్నారు.