డిసెంబర్లో ఎస్ఎఫ్ఐ సభలు
గోడపత్రిక ఆవిష్కరణ
విజయనగరం,నవంబర్20(జనంసాక్షి): విజయనగరంలో ఎస్ఎఫ్ఐ 27 వ మహాసభలు డిసెంబర్ 7, 8 తేదీల్లో ఎస్ కోటలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తెలిపారు. మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రామ్మోహనరావు, కె.సురేషులు మహా సభల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలోనూ, విద్యా రంగ
సమస్యల్ని పరిష్కరించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మహాసభల్లో వీటిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నామని పేర్కొన్నారు. డిసెంబర్ 7 వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని ప్రకటించారు.