డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్పు

వరంగల్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను మరోమారు ముందుకు జరిపారు. వచ్చేనెల 2నుంచి జరగాల్సినే వార్షిక పరీక్షలు వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం 2వ తేదీ నుంచి జరగాల్సిన ఈ పరీక్షలను 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌రెడ్డి షెడ్యూల్‌ను ప్రకటించారు. డిగ్రీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పీజీ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం వారికి వచ్చే నెల 8 నుంచి 22 తేదీల్లో, రెండో సంవత్సరం విద్యార్థులకు 9 నుంచి 23 తేదీల్లో తృతీయ సంవత్సరం వారికి 8నుంచి 24 తేదీలలో సరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.పీజీ ప్రథమ సంవత్సరం వారికి వచ్చే నెల 11, 15, 19, 23, 27 తేదీలలో, రెండో సంవత్సరం వారికి 9, 13, 17, 21, 25 తేదీలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు ఒక రోజు ముందు నుంచి తమ కేటాయించిన పరీక్ష కేంద్రాల నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను పొందవచ్చునని తెలిపారు.