డ్రగ్సట్‌ కేసులో డాక్టర్‌ అరెస్ట్‌

శ్రీకాకుళం,ఫిబ్రవరి1(జనం సాక్షి): శ్రీకాకుళ్‌ జిల్లాలో దారుణ గటన వెలుగు చూసింది. డ్రగ్స్‌ కేసులో రాజాంకు చెందిన ప్రముఖ వైద్యుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజాంలో ఈఎన్‌టీ వైద్యుడిగా పృథ్విరాజ్‌ గుర్తింపు పొందారు. డ్రగ్స్‌ కేసులో విశాఖలో పట్టుబడ్డ ముఠాతో డాక్టర్‌కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. హైదరాబాద్‌కు చెందిన మాలవ్య అనే యువతికి డాక్టర్‌ పృథ్వి అకౌంట్‌ నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్‌ అరెస్ట్‌ అయ్యారు. హేమంత్‌కు డాక్టర్‌ పృథ్విరాజ్‌ స్నేహితుడు.