డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడిన ప్రముఖుల సంతానం అరెస్టు

హైదరాబాద్‌ : ఒకరు శాసనసభ్యుని కుమారుడు, మరోకరు మున్సిపల్‌ కమిషనర్‌ కుమారుడు. వీరిద్దరూ నగరంలోని ఉప్పల్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇందులో ఒకరు వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ కుమారుడు సునీల్‌ రాథోడ్‌, మరోకరు కరీంనగర్‌ జిల్లాలో పని చేస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ కుమారుడు అభిజిత్‌ కుమార్‌, ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వీరిద్దరూ డ్రగ్స్‌ తీసుకుంట్లూ సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి గంజాయితో పాటు ఇతర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.