డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ స్రవంతి నగర్ లోని 45 లక్షలతో నూతన డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకతీతగా అభివృద్ధిలో అన్ని డివిజన్ లోని బస్తీలు కాలనీలకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. స్రవంతి నగర్ లోని నూతన డ్రైనేజీ పనులు వాటర్ పైప్ లైన్లు సిసి రోడ్లు వివిధ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని జరుగుతున్న అభివృద్ధి పనులకు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి, డిఈ మహేష్, ఏఎంహెచ్ ఓ మంజుల, శానిటేషన్ అధికారి ప్రభాకర్, జలమండలి డీజీఎం సాంబయ్య, ఎంజీఆర్ రమేష్, సూపర్వైజర్ గణేష్,
 స్రవంతి కాలనీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి కర్ణాకర్ ప్రసన్న శంకర్ రెడ్డి, ఆగం రెడ్డి, భాస్కర్ చారి, లక్ష్మీనారాయణ, ముత్యం రెడ్డి, రామచందర్, రాజశేఖర్, ప్రవళక, అనిత, సుజాత, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, మసూద్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రావణ్ కుమార్, బలవంత రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, మల్లెల శివ, విష్ణు, లక్ష్మణ్, రాజు, సందీప్, ఓంకార్, ఉదయ, తదితరులు పాల్గొన్నారు.