ఒడిశా వండర్ కిడ్ బుదియా సింగ్ కనిపించటం లేదు. దాదాపు నెల రోజులుగా అతని జాడ తెలియకుండా పోయింది. దీంతో, బుదియా మిస్సింగ్ పై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సి.డబ్ల్యు.సి) ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడేళ్లకే మారథాన్, నాలుగేళ్ల వయసులో 40 మైళ్లు పరుగెత్తి బుదియా రికార్డు సృష్టించాడు. అతి చిన్న వయసులోనే ఏకంగా 48 మారథాన్లు పూర్తిచేశాడు. దీంతో దేశ వ్యాప్తంగా బుదియా పేరు మారుమోగింది. బుదియాకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా స్పోర్ట్స్ హాస్టల్ లో అడ్మిషన్ ఇచ్చారు. ఐతే, అచూకీ లేకుండా పోయిన బుదియా గురించి ఏం చర్యలు తీసుకున్నారని హాస్టల్ ఇంఛార్జ్ ని సి.డబ్ల్యు.సి ప్రశ్నించింది.