ఢిల్లీలో కిసాన్ ర్యాలీ
న్యూఢిల్లీ,సెప్టెంబర్5(జనం సాక్షి): వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతులు, కార్మికులు రామ్లీలా మైదానం నుండి కిసాన్ ర్యాలీని ప్రారంభించారు. పార్లమెంటు వీధిలోని జంతర్మంతర్ వరకు ప్రదర్శన గా బయలుదేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల కేరళ వరదల భీభత్సం నుండి బయటపడిన కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి హాజరైందుకు వారికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీలో సిపిఎంతో పాటు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సిఐటియు), అల్ ఇండియా కిసాన్ సభ(ఎఐకెఎస్), ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్యూనియన్ (ఎఐఎడబ్ల్యుయు)తో పాటు ఈ ఏడాది మార్చిలో కిసాన్ మార్చ్ ఇన్ మహారాష్ట్రలో పాల్గొన్న కార్యకర్తలు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు.