ఢిల్లీలో కుప్పకూలిన భవనం: ఏడుగురికి గాయాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  దేశరాజధాని ఢిల్లీలోని భారత్‌ నగర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే ఈరోజు ఉదయం ఉత్తర ఢిల్లీలోని భారత్‌ నగర్‌ ప్రాంతంలోని సావన్‌ పార్క్‌ సవిూపంలోగల ఒక నాలుగంతస్తుల భవనం కూలిపోయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. కాగా భవనం శిధిలాల కింద 25 మంది వరకూ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా గతంలోనూ ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.