ఢిల్లీలో భవనం కూలి ఐదుగురు మృతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో మూడు అంతస్తుల బిల్డింగ్‌ కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకొని నలుగురు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిథిలాల తొలగింపు చేపట్టాయి. సావన్‌ పార్క్‌ ప్రాంతంలో అశోక్‌ విహార్‌ ఫేజ్‌ 3లో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.