తల్లిదండ్రుల మందలింపుతో విద్యార్థిని ఆత్మహత్య

గుంటూరు,జనవరి17(జ‌నంసాక్షి): కాలేజీకి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారన్న కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పావని(18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీకి వెళ్లడం లేదంటూ తల్లిదండ్రులు పావనిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన పావని ఇంటికి సవిూపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పావని మృతదేహన్ని వెలికితీశారు. శవపరీక్ష నిమిత్తం పావని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పావని మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.