తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు రూ. 9 కోట్ల 20లక్షలు అందజేశారు

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు రూ. 9 కోట్ల 20లక్షలు భారీ విరాళాన్ని అందజేశారు. ఇందులో రూ. 6కోట్లు స్వామివారికి, మరో రూ. 3 కోట్ల 20 లక్షలు చిన్న పిల్లల ఆసుపత్రికి ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి సంబంధిత పత్రాలను అందజేశారు. స్వర్గీయ డాక్టర్‌ ఆర్‌ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో  చైర్మన్ కు అందజేశారు.

చెన్నైలోని మైలాపూర్‌కు చెందిన డాక్టర్‌ పర్వతం పేరుపై బ్యాంకులో రూ.3 కోట్ల 20 లక్షల నగదు, డిపాజిట్లు, రూ. 6కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. తన సోదరి జ్ఞాపకార్థం ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు రేవతి తెలిపారు.