తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ..  శారదా మఠం పీఠాధిపతి

తిరుమల, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : శారదా మఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామం అనంతరం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అర్చక వ్యవస్థను చిన్నచూపు చూడటం సరికాదని స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. మిరాశీ అర్చకులకు వయోపరిమితి పెట్టడం సబబు కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అర్చకులకు సానుకూలంగా తీర్పును వెలువరించడం శుభపరిణామం అని అన్నారు. సుప్రీంకోర్టుకు టీటీడీ వెళ్లిన ఇదే తీర్పు వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు.