తీన్మార్ మల్లన్న పై రాయికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

రాయికల్, సెప్టెంబర్ 26(జనం సాక్షి)
రాయికల్ మండలంలోని రామాజీపేట వెలమ సంక్షేమ సంఘ సభ్యులు మీడియా జర్నలిస్ట్ అయిన తీన్మార్ మల్లన్న పై మంగళవారం స్థానిక రాయికల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజుల క్రితం వెలమకుల సామాజిక వర్గాన్ని అవహేళన చేసేలా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ రావుల (వెలమ) మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించినందుకు అతనిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రామాజీపేట వెలమ(రావు) సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు