తుపాను బీభత్సం: 17కి చేరిన మృతుల సంఖ్య


5]
సువా: ఫిజి దీవిలో విన్‌స్టన్‌ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి మృతుల సంఖ్య శనివారం నాటికి 17కి చేరింది. శనివారం సంభవించిన తుపానును అయిదో కేటగిరీకి చెందిన మహాతుపానుగా ఫిజి వాతావరణ కేంద్రం పేర్కొంది. తుపాను కారణంగా విమాన రాకపోకలను నిలిపివేశారు.

గంటకు 325 కి.మీ(202మైళ్లు)వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిజిలో ఇప్పటివరకు ఇదే అత్యంత శక్తిమంతమైన తుపాను అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ధాటికి 300 ద్వీపాలు అతలాకుతలమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.