తెరాస ప్రభుత్వ పాలనతో అన్ని వర్గాల్లో అసంతృప్తి మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశర్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 26 (జనంసాక్షి): మండల బిజెపి అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న  ప్రజాగోస బిజెపి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం రెండోరోజు మండల పరిధిలోని ఆయా గ్రామాల మీదుగా బైకు యాత్ర కొనసాగింది. కార్యక్రమంలో  చేవెళ్ల పార్లమెంటు మాజీ సభ్యులు మల్కిజగూడ, మేడిపల్లి, నానక్ నగర్, తాటి పర్తి, కుర్మిద్ద,సింగారం, నందివనపర్తి, చింతుల్ల, ధర్మన్నగూడా, చౌదర్పల్లి, గున్గల్, గడ్డమల్లయ్యగూడా గ్రామలలో పర్యటించారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని గ్రామాల ప్రజా గోస బిజెపి భరోసాయాత్రలో భాగంగా  తెరాస ప్రభుత్వ పాలనతో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని  ప్రజలకు ఇచ్చిన హమీల విషయంలో  ఏ ఒక్కరికి కూడా భరోసా కల్పించకపోగా వాటిని అమలు చేయలేదన్నారు.  రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోను అటు ఇబ్రహీంపట్నం  గడ్డపై తెరాస కంచు కోటలు బద్దలు కాబోతున్నాయని తద్వారా  బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి,  ఎస్సి మోర్చా అధ్యక్షులు కొప్పు బాష,  కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి అంజయ్య యాదవ్, బోసు పల్లి ప్రతాప్, కొత్త అశోక్ గౌడ్, అర్జున్ రెడ్డి, దయానంద్ గౌడ్,  సర్పంచ్ లు శ్రీధర్ రెడ్డి, రాజు, ఉపసర్పంచ్ లు యాదగిరి రెడ్డి, శ్రీశైలం, వినోద్ జిల్లా బాద్యులు  మండల కమిటీ బాద్యులు వీరితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Attachments area

తాజావార్తలు