తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక

5

– రూ.790 కోట్ల కరువు సాయం

న్యూఢిల్లీ,జనవరి14(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.791 కోట్ల కరువుసాయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ ప్రకటన చేశారు. తెలంగాణకు కరువు సాయంపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవిభాజ్య ఏపీకి కూడా ఇంత సాయం లభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణకు కరవు సాయం అందజేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రి రాధామోహన్‌ సింగ్‌ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. నిన్న మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రిని వ్యక్తిగతంగా కలిసి కరవు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఎక్కువ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి కరువు సాయం అందించాలని పలువురు నేతలు గత కొన్ని రోజులుగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి కేంద్రం మంత్రలతో వరుస భేటీలు జరిపి కేంద్రం నుంచి తెలంగాణకు కరువు సాయం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.