తెలంగాణపై అఖిలపక్షం తేదీ ఖరారు

ఢిల్లీ : తెలంగాణ అంశంపై మొత్తానికి కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ అంశంపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశాం నిర్వహించడానికి తేదీ ఖరారైంది. డిసెంబరు 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పలు దఫాలుగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో చర్చలు జరిపారు. అనంతరం డిసెంబరు 28న అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.