తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీఎస్‌జీవోల నేత స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ హాజరయ్యారు. ఇంకా రిటైర్డ్‌ డీజీపీ పేర్వారం రాములు, మాజీ ఐఏఎస్‌ అధికారులు గోయల్‌, రాంలక్ష్యన్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.