తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి ఆరు సూత్రాలు

` ప్రపంచంతో పోటీ పడేలా విధానాలు రూపొందించాలి
` తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఆరు కొత్త పాలసీలు
` కార్మికులకు ఉపయోగపడేలా పవర్‌లూమ్‌, హ్యాండ్‌లూమ్‌ పాలసీ
` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ దిశానిర్దేశం
హైదరాబాద్‌(జనంసాక్షి):పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్‌ ఇండస్టియ్రల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ కార్పొరేషన్‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సవిూక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సవిూక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్‌ టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్‌ లూమ్‌, హ్యాండ్‌ లూమ్‌ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ఎంఎస్‌ఎంఈ, ఎగుమతులు, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ టూరిజం, గ్రీన్‌ ఎనర్జీ, ఈవీ పాలసీలకు సవరణ చేస్తున్నట్టు వెల్లడిరచారు. టెక్స్‌ టైల్స్‌ రంగానికి సంబంధించి పవర్‌ లూమ్‌, హ్యాండ్‌ లూమ్‌ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని రేవంత్‌ రెడ్డి అన్నారు.పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఆరు పాలసీలను రూపొందించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎక్స్‌ పోర్ట్‌ పాలసీ, న్యూ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ, రివైజ్డ్‌ ఈవీ పాలసీ, మెడికల్‌ టూరిజం పాలసీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తుమన్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్‌ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్‌ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. పారిశ్రామికాభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలను మెరుగు పరుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు పలువురు పాల్గొన్నారు.