తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందించండి

` పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి
` రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి
` ట్రిపుల్‌ఆర్‌ ప్రాజెక్టును సత్వరం చేపట్టేలా చూడండి
` హైదరాబాద్‌లో ఐఐఎ ఏర్పాఉటకు సహకరించండి
` మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ఆర్థిక చేయూతను ఇవ్వండి
` ప్రీ బడ్జెట్‌ సమావేశంలో కేంద్రానికి భట్టి వినతి
న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. శనివారం న్యూఢల్లీిలోని అశోకా హోటల్లో ప్రి బ్జడెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి.. ఈ మేరకు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌ ముందస్తు సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడిన ఆయన తెరాష్టాల్రతో బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక దేశం కేంద్ర`రాష్టాల్ర సమన్వయం ద్వారానే పురోగమిస్తుంది. కేంద్ర బ్జడెట్‌ తయారీలో రాష్టాల్రను భాగస్వామ్యం చేయడం ముఖ్యమైన చొరవ. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నానని భట్టి అన్నారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతం. మా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మేము తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ను ఆవిష్కరించాము. దీని ద్వారా తెలంగాణను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్‌ డాలర్ల నుండి 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నాం. తద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణలో పెట్టుబడి రేటును ప్రస్తుత 37 శాతం నుంచి 50 శాతానికి పెంచాల్సి ఉంది. రాష్టాల్ర ద్రవ్య లోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాలి.రాష్టాల్రకు ఇస్తున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నాము. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను ఎఫ్‌బిఆర్‌ఎం పరిమితుల నుంచి మినహాయించాలి. తెలంగాణలో ప్రస్తుతం 1000కి పైగా కులాల వారీగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయి. మా ప్రభుత్వం 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకుంటారు. అనేక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. కేంద్రం తన మొత్తం వ్యయంలో 20 శాతం కంటే ఎక్కువ రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోంది. ఇందులో 25 శాతం తగ్గించి, ఆ రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్టాల్రకు బదిలీ చేయాలని సూచిస్తున్నాము. ప్రస్తుతం సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరింది. దీని వల్ల 15వ ఆర్థిక సంఘం 41 శాతం పన్ను బదిలీని సిఫార్సు చేసినప్పటికీ.. రాష్టాల్రకు కేవలం 30 శాతం మాత్రమే అందుతోంది. దాదాపు రూ1,55,000 కోట్ల సర్‌ ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలి. లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్టాల్రకు వాటా ఇవ్వాలి. తెలంగాణలో ప్రాంతీయ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాము. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ 2: దీనికి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఐఐఎంఏర్పాటును ప్రకటించాలి. మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్‌ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. పెద్దపల్లి, వరంగల్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెంలో విమానాశ్రయాలను మంజూరు చేయాలి.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ14,100 కోట్లు, రేడియల్‌ రోడ్ల కోసం రూ45,000 కోట్లు, హైదరాబాద్‌ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ17,212 కోట్లు కేటాయించాలన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో మా అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాము.. అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.