తెలంగాణ సర్కారుకు ప్రతిష్టాత్మక అవార్డు

5

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతోంది. సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌ 18 పురస్కారం లభించింది. ప్రామిసింగ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015గా జ్యూరి సెలెక్ట్‌ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి సహా అన్ని రంగాల్లో నిబద్ధతతో పనిచేస్తున్నందుకు గాను సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌-18 అవార్డు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ప్రామిసింగ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2015గా జ్యూరీ తెలంగాణను ఎంపిక చేసింది. నిర్దేశించిన అన్ని ప్రమాణాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని జ్యూరి అభిప్రాయపడింది. జనవరి 13న ముంబైలో జరిగే సీఎన్‌బీసీ నెట్‌ 18 అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కారం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం పంపించారు. అవార్డు ప్రకటన పట్ల తెలంగాణ రాష్ట్ర సర్కారు హర్షం వ్యక్తం చేసింది.