తెలంగా ఇవ్వకుంటే మళ్లీ సమ్మె దేవీప్రసాద్‌

 

 

తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యోగులు మరోమారు సకల జనుల సమ్మె చేయాల్సి వస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ అన్నారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవో ఉద్యోగుల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సకల జనుల సమ్మె సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్ని సర్కారు తుంగలో తొక్కిందన్నారు. అలాగే మార్చ్‌ సందర్భంగా ఉద్యోగులపై సంబంధంలేని కేసులు నమోదుచేసి వేధిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే మరోసారి సకల జనుల సమ్మెకు సిద్దమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. డిసెంబర్‌ 1న ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమవుతుందని జేఏసీ నేతలు తెలిపారు. ఆ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు.