తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 316 ఆలౌట్‌

కోల్‌కత:ఈడెన్‌గార్డెన్స్‌ వేదకగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోభారత్‌ 316 పరుగులకు ఆలౌటౌంది. 7 వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 43 పరుగులు మాత్రమే చేసి మిగిలినమూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో పనేసర్‌ 4, అండర్సన్‌ 3, స్టీవెన్‌ ఫిన్‌, స్వాన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. భారత్‌ బ్యాట్స్‌మెన్లలో సచిన్‌ 76 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా గంభీర్‌ (60), ధోని (52) అర్థసంచరీలు సాధించారు.