థానే జైల్లో ఖైదీల యోగా

థానే: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ముంబయిలోని థానే సెంట్రల్‌ జైల్‌లో నిర్వహించారు. ఎరవాడ సెంట్రల్‌ జైల్‌, పతంజలి యోగ సమితి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో 700 మంది ఖైదీలు యోగా సాధన చేశారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(జైలు) బీ.కే ఉపాధ్యాయ, జైల్‌ సూపరింటెండెంట్‌ హీరాలాల్‌ జాదవ్‌ పాల్గొన్నారు. ఖైదీలతో పాటు ఉన్నతాధికారులు, జైలు సిబ్బంది కూడా యోగా చేశారు.థానే మేయర్‌ సంజయ్‌మోర్‌, జిల్లా కలెక్టర్‌ మహేంద్ర కల్యాణ్‌కర్‌ నగరంలోని దాదోజి కొండెవ్‌ స్టేడియంలో ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక మానసిక ఆరోగ్య కేంద్రంలోని 100 మంది రోగులు, సిబ్బంది, సూపరింటెండెంట్‌ డా.రాజేంద్ర శిర్‌సత్‌ యోగాసనాలు వేశారు.