దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చారిత్రాత్రిక నిర్ణయం అని తెలిపారు.దానిలో భాగంగా శుక్రవారం  చంపాపేట డివిజన్ మారుతి నగర్ కు చెందిన గోకుల్ సరోజ  దళితబంధు పధకం క్రింద  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  యొక్క కార్యాలయంలో వివరాలు నమోదు చేశారు.దానిలో భాగంగా దళితుబంధు పథకం క్రింద వారు బోటిక్ ఎంచుకోవడం జరిగింది.ఈ రోజు సుధీర్ రెడ్డి  చేతుల మీదుగా లింగోజిగూడా డివిజన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ నందు నెలకొల్పిన బోటిక్ అండ్ ఎంబ్రాయిడరీ షాప్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో మిగతవారికి ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం.అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.తమ అభివృద్ధిని తామే నిర్వహించుకునే దిశగా చైతన్యమై,ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.పరిశ్రమలను,ఉపాధిని,వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పడం వల్ల ఇబ్బందులు వస్తాయని,అది దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల యూనిట్లు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.డిమాండ్ను బట్టి యూనిట్లు ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు.శాఖల వారిగా యూనిట్లు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను బట్టి నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.ఎస్సీలను వ్యాపారులుగా తయారు చేయుటలో బిజినెస్ కల్పించి ఆర్ధికాభివృద్ధి సాధించడానికి అధికారులు ఆలోచన చేయాలని చెప్పారు.ఎంపిక చేసిన లబ్దిదారులకు 9 లక్షల 90 వేలు చెల్లించి,మిగిలిన 10 వేలకు ప్రభుత్వ వాటాగా 10 వేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.దురదృష్టవశాత్తు మరణించిన లబ్దిదారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిధి ఒక ఇన్సూరెన్సు వలే ఉపయోగపడుతుందని చెప్పారు.ఇట్టి కార్యక్రమంలో లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు,సీనియర్ నాయకులు నల్ల.రఘుమరెడ్డి,  గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ   డైరెక్టర్   సుంకోజు.కృష్ణమాచారి  , వరప్రసాద్ రెడ్డి, చంపాపేట్  డివిజన్ తెరాస బిసి సెల్ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్  ,  రాజిరెడ్డి, ,నర్రె.శ్రీనివాస్,పార్వతి,రోజారెడ్డి,ప్రభాకర్,ఉమ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.