దిల్లీలో మహిళల ఆధ్వర్యంలో క్యాబ్ సేవలు
హైదరాబాద్: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) త్వరలో నగరంలో పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే క్యాబ్ సర్వీసులను ప్రారంభించే ఆలోచనలో ఉంది. బస్సులు, ట్యాక్సీల్లో మహిళలపై జరుగుతున్న నేరాలకు చెక్ పెట్టాలంటే క్యాబ్ సేవలందించే బాధ్యత మహిళలకే అప్పజెప్పడం మంచిదని ఎన్డీఎంసీ భావిస్తోంది. నిజానికి ఈ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 20 ట్యాక్సీలతో ‘శక్తి’పేరుతో సర్వీసులను ప్రారంభించాలనుకున్నారు. కానీ విధివిధానాలు ఒక కొలిక్కి రాకపోవడంతో ప్రారంభం వాయిదా పడింది.