: దిశ దిన కర్మలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు బట్టా విజయ్ గాంధీ

బూర్గంపహాడ్ జూలై  (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన మేక వెంకట నరసయ్య గోదావరి ముంపు ప్రాంతం పడవ ప్రమాదంలో గల్లంతైయ్యారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనేత బట్టా విజయ్ గాంధీ, వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసనిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంద నాగరాజు, మహిళ కాంగ్రెస్-నాయకురాలు బర్ల నాగమణి, సెనగ కిషోర్, బర్లా శేషు, ప్రభాకర్, సునీల్, పెరుమల రాంబాబు, రాజా, కాలనీ యువత, గ్రామపెద్దలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area