దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పవనాలు


మోడీ ఎపికి నమ్మక ద్రోహం చేశారు
కాంగ్రెస్‌ కన్నా బిజెపితోనే ఎక్కువ నష్టం
జన్మభూమిలో చంద్రబాబు విమర్శలు
గుంటూరు,జనవరి3(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నమ్మకం ద్రోహం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి-మఊ/ూరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..  విభజన తర్వాత లోటు బ్జడెట్‌ ఉంది, దానికి తోడు రాజధాని, పరిశ్రమలు లేవు. రాజధాని శంకుస్థాపనకు పిలిచి పునాది వేయమని ఆహ్వానిస్తే.. మోదీ వచ్చి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారు. రావాల్సింది అడిగితే.. నావిూద ఎదురుదాడి చేసి పరిస్థితికి వచ్చారు. ఏటా కేంద్రానికి నాలుగైదు వేల కోట్లు పన్నులు కడుతున్నాం. ఏపీకి చేయూతనిస్తే
గుజరాత్‌ రాష్ట్రాన్ని మించిపోతామని మోదీకి భయం. ఈ మాత్రం నిలదొక్కుకున్నామంటే అది అధికారుల కష్టం. దేశం మొత్తం ఎన్డీయే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దేశం మార్పు కోరుతోంది. ఈసారి ఎన్డీయే ఓడిపోవడం ఖాయం అని అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని  చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఏపీ ఒక్కటే కాదని.. దేశం మొత్తం మార్పు కోరుకుంటోందని చంద్రబాబు అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామన్నారు. విభజన చట్టాన్ని అమలుచేస్తామని హావిూ ఇచ్చిన మోదీ మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. విభజన గాయాన్ని మాన్పకుండా వేడుక చూస్తున్నారని మండిపడ్డారు. విభజన హావిూలపై టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తే పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేశారని,  కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా బీజేపీనే నష్టం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన చట్టాన్ని కూడా బీజేపీ అమలుచేయలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రత్యేక ¬దాపై మాటల గారడీ చేశారన్నారు. రాష్ట్రానికి  న్యాయం చేయాలని పార్లమెంట్‌లో పోరాడుతుంటే మన ఎంపీలను ఎన్నోసార్లు సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌లు చేస్తే భయపడేది లేదు. నిన్న మోదీ మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ దుష్ట కాంగ్రెస్‌ అంటే, నేను దోస్త్‌ కాంగ్రెస్‌ అంటున్నానని ప్రచారం చేస్తున్నారు.  ప్రత్యేక ¬దా అడిగితే మాట మార్చి గారడీలు చేస్తున్నారు. ముగ్గురు మోదీలు ఒక్కటై ఆంధ్రప్రదేశ్‌పై కుట్ర చేస్తున్నారు. మనకు అన్యాయం చేశారనే కేంద్రం, ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. రాష్టాన్రికి కాంగ్రెస్‌ కంటే భాజపానే ఎక్కువ మోసం చేసింది. రఫేల్‌ విూద ఎన్ని ఆరోపణలు వచ్చినా  మోదీ సమాధానం చెప్పరు. రూ.2వేల నోటు వల్ల అవినీతి పెరిగింది గానీ తగ్గలేదు. ప్రధాని స్థాయిలో మోదీ అన్నీ అబద్దాలు, అసత్యాలే చెబుతున్నారు.  కొందరు బ్యాంకులను మోసం చేసి పారిపోతే  ఇప్పడు పట్టుకొస్తామంటున్నారు.  పోలవరానికి రూ.7వేల కోట్లు ఇచ్చామంటున్నారు.. ఇంకా రూ.74వేల కోట్లు ఇవ్వాలి. పోలవరాన్ని భాజపా కాదు.. కాంగ్రెస్‌ వాళ్లే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చంద్రబాబు వివరించారు. అంతకుముందు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పెదపాలెం, పాపాయపాలెంలో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అలాగే గాలిపటం ఎగరవేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతోపాటు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.