నగరంలో కుక్కల బెడద

తండ్రి కూతుర్లకు పై వీధి కుక్కల దాడి..

సిద్దిపేట, జనవరి 7:నగరంలో కుక్కల బెడదకు ప్రజలు బింబెలెత్తిపోతున్నారు.  నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు నెలల బాబు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన మరువకముందే నిజాంపేటలో మరొక ఘటన చోటు చేసుకుంది.నిజాంపేట్ రోడ్ లోని హోలిస్టిక్ హాస్పిటల్‌లో తండ్రి కూతుర్లకు చికిత్స అందిస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను ఆడుకునేందుకు బయటకు పంపించాలన్న, అత్యవసరంగా కిరాణా షాపులకు వెళ్లి ఏమైనా తెచ్చుకోవాలన్న భయపడాల్సి వస్తొదంటూ ఆందోళన చెందుతున్నారు.