నటి ప్రియాంక ఆత్మహత్య
చెన్నై, జులై18(జనం సాక్షి) : టీవీ సీరియల్స్ తో బుల్లితెరపై పాపులరైన నటి ప్రియాంక (33) బుధవారం ఉదయం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని వలసరవక్కంలో నివసించే ఈ నటి పలు టీవీ సీరియల్స్ తో పాటు అనేక సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూడేళ్ళ క్రితం ప్రియాంక అరుణ్ బాల అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వలన గత మూడు నెలల నుంచి విడిగా ఉంటున్నది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నదా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన వంశం అనే సీరియల్ లో జ్యోతిక పాత్రలో నటించిన ప్రియాంక అందరిని మెప్పించింది. సీరియల్ ద్వారా ప్రియాంక ఫెమస్ అయింది. మంగళవారం వరకు అందరితో కలిసి సంతోషంగా ఉన్న ప్రియాంక సడెన్ గా ఆత్మహత్యం చేసుకుంది అని తెలుస్తుంది. ప్రియాంక మృతితో తమిళ సీరియల్ పరిశ్రమ షాక్ కు గురైంది. ప్రియాంక మృతి పట్ల తమిళ సీరియల్, సినిమా పరిశ్రమ తమ సంతాపాన్ని
వ్యక్తం చేశారు.