నర్సీపట్నంలో అఘోరాల హల్ చల్

గంజాయి తాగి రోడ్లపై వాహనాలు అపుతూ వీరంగం

అటుగా వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు

నర్సీపట్నం ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :

నర్సీపట్నంలో మరోసారి అఘోరాలు దర్శనమిచ్చారు. గతంలో అఖండ సినిమా చూసేందుకు వచ్చిన వీరు ఈసారి వాహనాలు అపుతూ హల్ చల్ చేశారు. స్థానిక కృష్ణాబజార్ సెంటర్లో అప్పటికే గంజాయి తాగి ఉన్న వీరు బట్టల్లేకుండా అటు, ఇటు తిరుగుతూ ఆ రోడ్డు గుండా వచ్చే వాహనాలను ఆపుతూ వీరంగం సృష్టించారు. వాహనాలకు అడ్డుగా వెళ్లడం, డబ్బులిస్తే అడ్డు తొలిగేవారు. లేని పక్షంలో అడ్డుగా ఉంటూ భీభత్సం చేశారు. ఆ ప్రాంతమంతా కొంతసేపు నిలిచిపోయిన వాహనాలతో రద్దీగా మారింది. ఇదే సమయంలో ఫస్ట్ షో సినిమా చూసి అటుగా వచ్చే స్థానికులు అటుగా వెళ్లేందుకు భయపడి, మరో దారి గుండా ఇళ్లకు చేరుకున్నారు. అరగంట పాటు భీభత్సం చేసిన వీరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని తెలియడంతో అక్కడి నుంచి పరారయ్యారు.