నల్గొండలో జిల్లాలో ఘోరం

1

– వృద్ధున్ని ఢీకొన్న కారు

– శవం కారుపై ఎగిరిపడ్డా 30 కిలోమీటర్ల ప్రయాణం

నల్లగొండ,జనవరి 2(జనంసాక్షి): నల్గొండ జిల్లా కట్టంగూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. శనివారం రోడ్డుదాటుతున్న ఓ వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధుడి కారుపైకి ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం కారుపై పడి ఉన్నా కారు డ్రైవర్‌ దానిని గమనించకుండా, కారును ఆపకుండా వేగంగా దూసుకుని పోయిడు. ఇది గమనించిన స్థానికులు కారుని వెంబడించి ఐటిపాముల వద్ద పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విషయం గమనించని డ్రైవర్‌ వేగంగా అయిటి పాముల గ్రామం వరకు వెళ్లాడని చెబుతున్నారు. స్థానికులు కారుపై వృద్దుడు ఉన్న విషయాన్ని గమనించి కారును ఆపారు.అప్పటికే వృద్దుడు మరణించాడు. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కారులో వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నార్కెట్‌పల్లి శివారులోని శ్రీసాయి ఆకాంక్ష ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద వెంకటరెడ్డి (65) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో వెంకటరెడ్డి ఎగిరి కారుపై పడ్డారు. అయితే కారు డ్రైవర్‌ ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో.. అదే వేగంతో కారులో దాదాపు 30 కిలోవిూటర్ల దూరం వరకు వెళ్లిపోయాడు. రోడ్డు పక్కన ఉన్న స్థానికులు గమనించి కారును ఆపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే వెంకటరెడ్డి మృతి చెందాడు. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే వృద్ధుడు మృతిచెందాడని స్థానికులు పేర్కొంటున్నారు. విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.