నాంపెల్లి కోర్టుకు మావోయిస్టు సానుభూతిపరులు
హైదరాబాద్: చత్తీస్గడ్లోని రాయపూర్లో ఓ నిరసన కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళుతున్న 15మందిని నగరంలోని ఇమ్లిబస్ బస్స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇద్దరు ఏపీసీఎల్సీ నేతలను కూడా అరెస్టు చేశారు. వారిని ఈరోజు నాంపెల్లి కోర్టులో హజరుపరిచారు.