నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

పట్టణ కార్పెంటర్స్ అసోసియేషన్
అద్యక్షుడిగా సంగోజు ప్రసాద్ చారి,ప్రధాన కార్యదర్శిగా అలవోజు విష్ణుమూర్తి.
అసోసియేషన్ సంక్షేమానికి కృషి చేస్తా.
కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు సంగోజు ప్రసాద్ చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు28(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ పట్టణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియే షన్
అధ్యక్షుడిగా సంగోజి ప్రసాదాచారి,ప్రధాన కార్యదర్శిగా అలవోజు విష్ణు చారి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం పట్టణంలో ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో పట్టణ విశ్వబ్రాహ్మణ,విశ్వకర్మ కార్పెంటర్ ల సమావేశం నిర్వహించుకు న్నారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గా న్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా పాండుచారి, దక్షణ మూర్తి, అధ్యక్షుడిగా సంగోజు ప్రసాద్ చారి,ప్రధాన కార్యదర్శి గా అలవోజు విష్ణు చారి, ఉపాధ్యక్షులుగా బాలాచారి,కోశాధికారి గా బాలరాజు, సహాయ కార్యదర్శులు గా పరమేశ్వరచారి, శేఖరాచారి,కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులు గా రసూల్ పషా, మనోహరాచారి, రాజు, వెంకటేశ్వర్లచారి, గుణాచారి, శ్రీనివాసాచారి, సైదులుచారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని విశ్వబ్రాహ్మణులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన విశ్వకర్మ కార్పెంటర్స్ అధ్యక్షులు సంగోజు ప్రసాద్ చారి మాట్లాడుతూ అసోసియేషన్ బలోపేతానికి సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు.అసోసియేషన్ సంక్షేమానికి కృషి చేస్తాని అన్నారు.ప్రతి కార్పెంటర్ కు మరియు విశ్వబ్రాహ్మణుని కి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కార్పెంటర్ల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నామీద నమ్మకముంచి అసోసియేషన్ అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు కార్పెంటర్లందరికి కృతజ్ఞతలు అని తెలిపారు.అనంతరం నూతన కార్యవర్గం వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.