నాగులమ్మ గణేష్ మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించిన..

నిరుడి సత్యనారాయణ

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 25 వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని టేక్మాల్ మండల కేంద్రంలోని నాగులమ్మ ఆలయం గణేష్ మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు,వివిధ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు