నాణ్యత సంఘాల సదస్సు ప్రారంభం

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): జ్యోతినగర్‌ ఎన్టీపీసీ పరిసర గ్రామాలకు సంబంధించిన నాణ్యత సంఘాల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. జ్యోతినగర్‌ సవిూపంలో 8 గ్రామాలకు సంబంధించిన సంఘాల సభ్యులు తమ పరిసరాల్లోని సమస్యలను గుర్తించి పవర్‌ పాయింట్‌ ద్వారా ప్రదర్శించారు. మంగళవారం సాయంత్రం ఉత్తమమైన 3 నాణ్యత సంఘాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్లు ఎన్టీపీసీ ఈడీ తెలిపారు.

.